
భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 338 పరుగులకు ఆలౌట్ అయింది. తొలిరోజు 166/2 చేసిన ఆసీస్ ఓవర్ నైట్ స్కోరు తో ఆట ప్రారంభించి.. అయితే ఈ రోజూ అంతగా రాణించలేకపోయింది. ఆసీస్ ఆటగాళ్లలో స్టీవ్ స్మిత్ 131, లబుషేన్ 91, పకోష్కీ 62 పరుగులు చేశారు.
డేవిడ్ వార్నర్ 6, మాథ్యూ 13, కామెరాన్ గ్రీన్ 0, టిమ్ 1, కమ్మిన్స్ 0, స్టార్క్ 24, లైయన్ 0, జొష్ 1 (నాటౌట్) పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో జడేజాకు 4, బుమ్రా, అశ్విన్ లకు రెండేసి వికెట్లు తీయగా, సిరాజ్ కు ఒక వికెట్ దక్కింది. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ క్రీజులో ఉన్నారు.